తెలుగు వ్యక్తికి పోలీసు శౌర్య పురస్కారం

తెలుగు పోలీసు ఉన్నతాధికారికి పోలీసు శౌర్య పతకం వరించింది. విధి నిర్వహణలో ధైర్య సహసాలు ప్రదర్శించినందుకుగానూ ఈ పురస్కారం లభించింది.
ఇంతకీ ఆ అధికారి ఎవరంటే.

డీఏఎన్ – ఐపీఎస్​ అధికారిగా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన రామ్ గోపాల్ నాయక్​కు అత్యున్నత పురస్కారం లభించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆయనను ఈ అవార్డ్​ వరించింది. రామ్ గోపాల్ నాయక్ 19 ఏళ్లుగా దిల్లీ పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు.

2018 ఫిబ్రవరి 5న అర్ధరాత్రి ఘజియాబాద్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఎన్ కౌంటర్​లో పాల్గొన్న పోలీసు బృందానికి నాయకత్వం వహించి ఐదేళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. ఇలా దిల్లీ ప్రజల అభిమానం సంపాదించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular