తెలుగు పోలీసు ఉన్నతాధికారికి పోలీసు శౌర్య పతకం వరించింది. విధి నిర్వహణలో ధైర్య సహసాలు ప్రదర్శించినందుకుగానూ ఈ పురస్కారం లభించింది.
ఇంతకీ ఆ అధికారి ఎవరంటే.
డీఏఎన్ – ఐపీఎస్ అధికారిగా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన రామ్ గోపాల్ నాయక్కు అత్యున్నత పురస్కారం లభించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆయనను ఈ అవార్డ్ వరించింది. రామ్ గోపాల్ నాయక్ 19 ఏళ్లుగా దిల్లీ పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు.
2018 ఫిబ్రవరి 5న అర్ధరాత్రి ఘజియాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందానికి నాయకత్వం వహించి ఐదేళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. ఇలా దిల్లీ ప్రజల అభిమానం సంపాదించారు.