నేలకొండపల్లి ముదిగొండ పోలీస్ స్టేషన్లలో సందర్శించిన పోలీస్ కమిషనర్

ప్రజల అంచనాలను అందుకుంటూ పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్  అన్నారు.శుక్రవారం ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని నేలకొండపల్లి ముదిగొండ   పోలీస్​ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.పోలీస్​ స్టేషన్​ పరిసరాలు స్టేషన్​ నిర్వహణ పోలీసుల పనితీరు రికార్డులను పోలీస్ కమిషనర్  పరిశీలించారు. కేసుల వివరాలు శాంతి భద్రతలు పోలీస్ స్టేషన్ లో 14 ఫంక్షనల్ వర్టికల్స్ పనివిధానాన్ని పరిశీలించారు.అనంతరం పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చే వారి పట్ల  వివక్ష చూపకుండా  అందరికీ సమానంగా న్యాయం అందేలా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల గౌరవం భంగం కలగకుండా మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు.శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు.పోలీస్  స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఏ విదంగా గౌరవం ఇవ్వాలి
వారిని ఏ విదంగా రిసీవ్ చేసుకోవాలి స్టేషన్ లలో రికార్డులను ఏవిధంగా భద్రపరుచుకోవాలి స్టేషన్ పరిసరాలను ఏ విదంగా పరిశుభ్రపరుచుకోవాలి
కానిస్టేబుల్స్ విధుల పట్ల ఏ విదంగా బాధ్యతయుతంగా ఉండాలి అనే అంశాలపై  తగు సూచనలు చేశారు. Attachments area

Telangana Sakshi
Telangana Sakshihttp://telanganasakshi.com
Gireesh Kumar is an Senior Telugu Journalist, Political analyst. He formerly served as editor of Telangana Sakshi, a Telugu Daily Newspaper and Web News. He is known for his commentary on Telangana Politics, and for hosting political talk shows.[
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular