ఆడియోలో మట్లాడించిన అదృశ్య శక్తుల నిగ్గు తెల్చాడానికి పిర్యాదు

జెడ్పి చైర్ పర్సన్ సరిత

జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2023 ప్రతినిధి:- గద్వాల:-నిన్న (మంగళవారం 03/01/2023) న సోషల్ మీడియాలో వచ్చిన నిరాదారమైన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాద్యులపై తగు చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా సుపరిడెంట్ అఫ్ పోలీసు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా కో ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరిత (saritha) తిరుపతయ్య మంగళవారం సాయంత్రం వాట్సాప్ గ్రూపులో గుర్తు తెలియని వ్యక్తులు ఆడియో పెట్టడం జరిగిందని,దాని సారాంశం ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం డబ్బులు ఇచ్చినానని దగ్గరుండి చూసినట్లు ప్రచారం చేస్తూ నా రాజకీయానికి మచ్చ తెచ్చే విధంగా ఉన్నదని, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ని, వీరుబాబు ని,రాజీవ్ రెడ్డి ని హీనంగా సంభోదించి,ఇలా కాంగ్రెస్ పార్టీని అబాసుపాలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తురని సరితమ్మ అన్నారు… వీరిపై ఆడియో ఆధారంగా విచారించి వీరిపై,వీరిని నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరు ఉన్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మా కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలని అదనపు ఎస్పీని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular